న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా వ్యాపిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 108, ఢిల్లీలో 79, గుజరాత్లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్లో 22 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. గత 24 గంటల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన 130 మంది ఒమిక్రాన్ రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.