న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, జైపూర్ మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడం తన కల అని కేంద్ర రోడ్డు, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్లో రోప్వే కేబుల్స్ను ఏర్పాటు చేసేందుకు 47 ప్రతిపాదనలు వచ్చినట్లు ఆయన చెప్పారు. కానీ ఢిల్లీ, జైపూర్ మధ్య ఎలక్ట్రిక్ హైవేను ఏర్పాటు చేయడం తన కల అన్నారు. రోడ్డు, రహదారుల శాఖకు మంచి బడ్జెట్ ఉందని, మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తోందన్నారు. 2022-23 సంవత్సరానికి రోడ్ల శాఖకు 1.99 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. దీంట్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 1.34 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.