న్యూఢిల్లీ: ఒడిశా రాష్ట్రానికి చెందిన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్పై యాంటీ డోపింగ్ ప్యానెల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. డోప్ టెస్టులో విఫలమైనందుకు ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ప్యానెల్ పేర్కొన్నది. నిషేధిత ‘సెలక్టివ్ ఆండ్రోజన్ రిసెప్టార్ మాడ్యులేటర్స్ (SARMs)’ను ద్యుతి తీసుకున్నట్లు గత ఏడాది డిసెంబర్లో నాడా (NADA) నిర్వహించిన డోప్ పరీక్షల్లో తేలింది.
దాంతో యాంటీ డోపింగ్ ప్యానెల్ ద్యుతిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం 2023 జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. నిషేధానికి సంబంధించిన లెటర్ అందుకున్నప్పటి నుంచి 21 రోజులలోపు తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ ద్యుతీచంద్ రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది.