న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 69 కోట్లు దాటింది. సోమవారం నాటికి 69, 68, 96,328 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సోమవారం రికార్డు స్థాయిలో కోటి మందికిపైగా టీకా డోసులు తీసుకున్నారని చెప్పింది. ఒక్క రోజే కోటీ మందికిపైగా టీకా వేయించుకోవడం గత 11 రోజుల్లో మూడోసారి అని పేర్కొంది.
మరోవైపు, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్, డెవలప్మెంట్ (OECD) గ్లోబల్ హెల్త్ అడ్వైజర్ నిక్ టాంలిన్సన్, OECD ఉపాధి, కార్మిక, సామాజిక వ్యవహారాల డైరెక్టర్ స్టెఫానో స్కార్పెట్టాతో ఇటలీలో వేర్వేరుగా భేటీ అయ్యారు. వారితో ప్రపంచ ఆరోగ్య ప్రాముఖ్యతపై చర్చించినట్లు ట్వీట్ చేశారు.