తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే.. భారత్ రియాక్షన్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా దుయ్యబట్టారు. ఇలాంటి పేలవమైన వ్యాఖ్యల వల్ల పూచిక పుల్లైనా ముందుకు జరగదని రాహుల్ ఆక్షేపించారు. భారత ప్రభుత్వం స్పందనతో ఒరింగిందేమీ వుండదన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని రక్షించాలని అన్నారు.
పాంగాంగ్లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తోందని, భారత ప్రాదేశిక సమగ్రతపై దాడి చేసినట్లు కాదా? అంటూ రాహుల్ సూటిగా ప్రశ్నించారు. చైనా పాంగాంగ్పై వంతెన నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం తమ దృష్టికి వచ్చిందని భారత్ ప్రతిస్పందించింది. చైనా అక్కడే రెండో వంతెన కూడా కట్టేస్తుంది. అప్పటికీ భారత్ ఇదే సమాధానం ఇస్తుంది. ఇలా పిరికిపంద సమాధానాలిస్తే ఏమీ జరగదు. ప్రధాని దేశాన్ని రక్షించాలి అని రాహుల్ ట్విట్టర్ వేదికగా సూచించారు.