Visa Free Entry | భారత్ నుంచి థాయ్లాండ్ వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఆ దేశం వెళ్లేందుకు ఇకపై వీసా అక్కర్లేదు. భారత్తో పాటు తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు థాయ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. మినహాయింపు నవంబర్ నుంచి మే 2024 వరకు కొనసాగుతుందని పేర్కొంది.
భారత్, తైవాన్ నుంచి వచ్చే వ్యక్తులు 30 రోజుల పాటు వీసా లేకుండా థాయ్లాండ్లో పర్యటించవచ్చని ఆయన పేర్కొన్నారు. వీసా మినహాయింపు, పర్యాటకుల వసతి గడువు పొడిగింపు సహా పలు నిబంధనలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
భారత్ నుంచి థాయ్లాండ్ వెళ్లే వారు రెండురోజుల థాయ్ వీసా కోసం 2వేల థాయ్ బాట్స్ (57 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. అక్కడి ప్రభుత్వం వచ్చే ఏడాది విదేశీ పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయాన్ని 3.3 ట్రిలియన్ బాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో టూరిటానికి స్వల్పకాలిక ఆర్థిక ఉద్దీపలను అమలు చేస్తున్నది. బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ డేటా ప్రకారం.. పర్యాటకంరంగం ఆ దేశ జీడీపీలో 12శాతం, ఉద్యోగాల్లో ఐదోవంతు దోహదం చేస్తున్నది.