న్యూఢిల్లీ : భారతీయులకు మామిడి పండ్లు (Mangoes) అంటే ఎంతో ప్రీతి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా వీటిని ఆరగిస్తారు. మార్కెట్కు వెళ్లి ఫల రాజాన్ని కొనుగోలు చేసే సమయం లేని వారు ఆన్లైన్లో ఈ పండ్లను ఆర్డర్ చేస్తున్నారు. ఏప్రిల్లో జెప్టోపై ఏకంగా రూ. 25 కోట్ల విలువైన మ్యాంగోలను ఆర్డర్ చేసినట్టు గ్రాసరీ డెలివరీ యాప్ వెల్లడించింది.
ప్రతి రోజూ రూ. 60 లక్షల విలువైన మ్యాంగోలకు ఆర్డర్లు వచ్చాయని జెప్టో తెలిపింది. మ్యాంగో మానియా కొనసాగుతుండటంతో ఇక మేలో గత నెల రిజల్ట్స్ను అధిగమించవచ్చని భావిస్తున్నారు. జెప్టో తెలిపిన గణాంకాల ప్రకారం రా మ్యాంగోలకూ కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. రూ. 25 లక్షల విలువైన రా మ్యాంగోలను కస్టమర్లు ఆర్డర్ చేశారు. ఎక్కువ ఖరీదైన మ్యాంగో రకం ఆల్పాన్సో మామిడికి జెప్టోపై అధిక ఆర్డర్లు వచ్చాయి.
ముంబై, బెంగళూర్, ఢిల్లీ నుంచి మామిడి ప్రియులు ఎక్కువగా రత్నగిరి మామిడి రకాలను అధికంగా ఆర్డర్ చేసినట్టు జెప్టో వెల్లడించింది. జెప్టోలో మామిడి విక్రయాల్లో 30 శాతం వాటా ఈ రకానిదే. ఏపీలోని బంగినపల్లి మామిడికీ మంచి డిమాండ్ ఉంది. జెప్టో సేల్స్లో 25 శాతం వాటా బంగినపల్లి మామడి నుంచి సమకూరడం విశేషం. తాజా మామడి రసాన్ని కూడా వేసవిలో పలువురు ఆస్వాదిస్తారు. సహజంగా మగ్గిన, స్వచ్ఛమైన నాణ్యతతో కూడిన మామిడి పండ్లను సేకరించి కస్టమర్లకు విక్రయిస్తున్నామని జెప్టో తెలిపింది.
Read More