చెన్నై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన రెండు కంటైనర్ ట్రక్కులు (Container truck) బ్యాంకులకు డబ్బును తీసుకువెళ్తున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ఇంతలో ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ (Breaks down) అయ్యాయి. దీంతో డ్రైవర్ జాతీయ రహదారిపై నిలిపివేశాడు. రెండో ట్రక్కు కూడా అక్కడే ఆగింది. ఆ రెండు ట్రక్కుల్లో రూ.1,070 కోట్లు ఉండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకున్నది.
చెన్నై (Chennai) నుంచి విళ్లుపురంలోని (Villupuram) వివిధ బ్యాంకులకు ఆర్బీఐ రూ.1,070 కోట్లు తరలిస్తున్నది. రూ.535 కోట్ల చొప్పన రెండు కార్గో ట్రక్కుల్లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని తాంబరం (Tambaram) వద్ద సాంకేతిక లోపంతో ఓ ట్రక్కు నిలిచిపోయింది. దీంతో రెండోది అక్కడే ఆగింది. పూర్తిగా డబ్బుతో ఉన్న రెండు కంటైనర్లు జాతీయరహదారిపై ఆగిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 17 మందితో వాటికి భద్రత ఏర్పాటు చేశారు. భారీ సెక్యూరిటీ నడుమ.. తాంబరంలోని సిద్ధా నేషనల్ ఇన్స్టిట్యూట్కు (Siddha institute) తరలించారు. అక్కడికి మెకానిక్లను తీసుకొచ్చా చెడిపోయిన దానిని బాగు చేయిస్తున్నారు. ఒకవేళ అదిబాగుకాకపోతే నగదును మళ్లీ రిజర్వ్ బ్యాంకుకు పంపిస్తామని తాంబరం ఏసీపీ శ్రీనివాసన్ (ACP Srinivasan) చెప్పారు.