న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారతీయులు ఇక నుంచి వీసా లేకుండా థాయ్లాండ్ను సందర్శించవచ్చు. అయితే ఈ ఆఫర్ ఈ ఏడాది నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు మాత్రమే. ఈ తేదీలలో ఒక్కో సందర్శకుడు ఈ ఉచిత వీసాసై 30 రోజుల వరకు తమ దేశంలో ఉండవచ్చునని ఆ దేశ పర్యాటక శాఖ ప్రతినిధి మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు.
టూరిజం పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు భారతీయులకు ఈ సౌకర్యం కల్పించినట్టు ప్రకటించింది. థాయ్లాండ్ టూరిజానికి అధిక ఆదాయం సమకూర్చే దేశాలలో భారత్ ఒకటి.