Dubai | దుబాయ్: దుబాయ్ విమానాశ్రయం (డీఎక్స్బీ) గుండా ప్రయాణించేవారిలో అత్యధికులు భారతీయులే. డీఎక్స్బీ సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2023లో ఈ విమానాశ్రయం గుండా 1.19 కోట్ల మంది భారతీయులు ప్రయాణించారు. అంతకుమునుపటి ఏడాది కంటే ఇది 31.7 శాతం అధికం. డీఎక్స్బీ నుంచి 104 దేశాల్లోని 262 పట్టణాలు, నగరాలకు విమానాల రాకపోకలు జరుగుతాయి. భారతీయుల తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా (67 లక్షల మంది), బ్రిటన్ (59 లక్షల మంది) ప్రయాణికులు ఉన్నారు.