న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: మాల్దీవుల్లో భారత సైనికుల స్థానంలో సమర్థులైన సాంకేతిక సి బ్బందిని ఉంచుతామని భారత్ వెల్లడించింది. మాల్దీవులతో రెండో ఉన్నత స్థాయి సమావేశం జరిగిన కొన్ని రోజుల తర్వాత గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయితే సాంకేతిక సి బ్బంది ఏ బాధ్యతలు నిర్వహిస్తారు తదితర వి వరాలు వెల్లడించడానికి నిరాకరించింది. వాస్తవానికి మాల్దీవులకు భారత బడ్జెట్లో నిధులు పెరిగాయని.. అయితే వాటిని సవరించాల్సి ఉందని.. ఆ తర్వాతే స్పష్టమైన సంఖ్య తెలియజేస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.
‘ఇప్పటికీ మేం మాల్దీవులకు ముఖ్యమైన అభివృద్ధి భాగస్వామ్యులం. ఆ విషయానికి కట్టుబడి ఉన్నాం’ అ ని జైశ్వాల్ భరోసా ఇచ్చారు. గతవారం న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య సమావేశం జరిగిన తర్వాత తమ దేశంలోని మూడు విమాన వేదికల్లో ఒక దానిలో మార్చి 10లోగా, మిగతా వాటిలో మే 10లోగా భారత్ తన సైనికులను వేరే వారితో భర్తీ చేయడానికి అంగీకరించిందని మాల్దీవుల ప్రభుత్వం వెల్లడించింది.