Olympiad| న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్-2023లో భారత విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన మెహుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఢిల్లీకి చెందిన ఆదిత్య, పుణేకు చెందిన ధ్రువ్ షాలకు కూడా స్వర్ణ పతకాలు దక్కగా, చండీగఢ్కు చెందిన రాఘవ్ గోయల్, ఛత్తీస్గఢ్కు చెందిన రిథమ్ కేదియా రజత పతకాలు సాధించారు. భారత్ నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా, అందరూ పతకాలు నెగ్గడం విశేషం.