మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతూ ఊబర్ ఈట్స్ డ్రైవర్గా పనిచేస్తున్న 22 ఏండ్ల భారత విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించాడు. సిడ్నీలో బాధిత విద్యార్ధి బైక్పై వెళుతుండగా అతడి వాహనం ఎస్యూవీని ఢీ కొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని ముంబైకి చెందిన అక్షయ్ దీపక్ దౌల్తానిగా గుర్తించారు. అక్షయ్ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేస్తూ ఫుడ్ డెలివరీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. న్యూ సౌత్ వేల్స్లో అతడు ప్రయాణిస్తున్న బైక్ ఎస్యూవీని ఢీ కొనడంతో మరణించాడని ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది.
మాక్వెరి యూనివర్సిటీలో ఫైనాన్స్లో మాస్టర్స్ చేస్తున్న అక్షయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వచ్చాడు. ఖర్చుల కోసం అతడు వారానికి మూడుసార్లు ఊబర్ ఈట్స్ డెలివరీ రైడర్గా పనిచేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం అనంతరం అక్షయ్ను రాయల్ నార్త్ షోర్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించాడని వైద్యులు తెలిపారు.
Read More :