లక్నో: కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నది. ఇవాళ యూపీలోని బాగ్పట్ జిల్లాకు రాహుల్ పాద యాత్ర చేరగానే అదే జిల్లాకు చెందిన వృద్ధ షార్ప్ షూటర్ ప్రకాశీ తోమర్ వారితో కలిశారు. రాహుల్తో కలిసి ఆమె నడిచారు. ప్రకాశీ తోమర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్పట్ జిల్లాలోని జోహ్రీ గ్రామానికి చెందినవారు. ప్రపంచంలోని ఓల్డెస్ట్ షార్ప్ షూటర్లలో ఆమె ఒకరు.
కాగా, బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్గాంధీ గత సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల్లో రాహుల్గాంధీ యాత్ర ముగిసింది.