న్యూఢిల్లీ: ఖగోళ ప్రయోగాల్లో సత్తా చాటుతున్న ఇస్రో భారీ సమాచార ఉపగ్రహం ‘జీశాట్-20’ ప్రయోగాన్ని నిర్వహించేందుకు అమెరికన్ ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’పై ఆధారపడనున్నది. ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ‘ఫాల్కన్-9’ రాకెట్ ద్వారా ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. భారీ ఉపగ్రహ ప్రయోగం కోసం భారత్ ‘ఫాల్కన్’ రాకెట్ను ఉపయోగించనుండటం ఇదే తొలిసారి.