న్యూఢిల్లీ, మార్చి 13 : రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారి అభిశంసన కోరుతూ భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా తీర్మానం నోటీస్ను పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు శుక్రవారం ప్రవేశపెట్టాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను అభిశంసించాలని డిమాండ్చేస్తూ లోక్సభ, రాజ్యసభలలో ఇండియా కూటమి ఎంపీలు శుక్రవారం నోటీసులు అందజేశారు.
సామూహికంగా ఓటర్ల తొలగింపునకు పాల్పడుతూ పక్షపాత, వివక్షాపూరిత వైఖరికి పాల్పడుతున్నందున ఆయనను తొలగించాలని కోరుతున్నట్టు వారు తెలిపారు. ఏడు ప్రధాన ఆరోపణలతో ఉన్న 10 పేజీల ఈ నోటీస్పై 130 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేశారు.