న్యూఢిల్లీ: న్యూస్ప్రింట్పై వసూలు చేస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సుంకాన్ని ఉపసంహరిస్తే, ప్రింట్ మీడియాకు ఎంతో ఉపశమనం దొరుకుతుందని, అంతేకాకుండా, ప్రజలకు విశ్వసనీయమైన వార్తలను అందజేసేందుకు దోహదపడుతుందని తెలిపింది.
రూపాయి విలువ క్షీణించడం, పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై దాడులు వంటి వాటివల్ల ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది.