న్యూఢిల్లీ: అగ్నిపథ్ (Agnipath) స్కీమ్పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల వెళ్లువెత్తినప్పటికీ.. భారత నావికా దళానికి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెళ్లువెత్తాయి. అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా నావికా దళం ఈ నెల 2న అగ్నివీర్ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. శుక్రవారం నాటికి 3,03,328 మంది దరఖాస్తు చేసుకున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అగ్నిపథ్ స్కీమ్ పేరుతో త్రివిధ దళాల్లో నూతన నియామక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. పదిహేడున్నర ఏండ్ల నుంచి 21 ఏండ్ల వారు దీనికి అర్హులని, నాలుగేండ్ల పదవీ కాలం తర్వాత రిటైర్మెంట్ ఉంటుందని పేర్కొన్నది. ఈ పథకం కింద నియమితులైన అగ్నివీరుల్లో 25 శాతం మందికి కొనసాగింపు ఉంటుందని వెల్లడించింది. అయితే ఈ విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం 2022 ఏడాదికి కొద్దిగా సడలింపులు ఇచ్చింది. అర్హత వయస్సును 23 ఏండ్లకు పొడిగించింది.