ముంబై, సెప్టెంబర్ 11: శత్రు దేశాల కంట పడకుండా దాడులు జరపడంలో కీలక పాత్ర పోషించే యుద్ధనౌక ‘తారాగిరి’ని భారత నావికా దళం ముంబైలో ఆవిష్కరించింది. 17ఏ ప్రాజెక్టులో భాగంగా స్టెల్త్ సాంకేతికతను ఉపయోగించి నావికా దళం ఈ యుద్ధనౌకను రూపొందించినది.
నౌక విడి భాగాలను పలు చోట్ల తయారుచేసి మజగావ్ డాక్ యార్డ్ వద్ద దగ్గరికి చేర్చి రూపొందించారు. బ్రిటన్ రాణి మృతిపట్ల సంతాప దినాల నేపథ్యంలో తారాగిరి ప్రారంభ కార్యక్రమం నిరాడంబరంగా జరిపారు. కాగా, రూ.25,700 కోట్లతో ప్రాజెక్టు 17ఏ కింద పలు యుద్ధ నౌకలను అభివృద్ధి చేస్తున్నారు.