న్యూఢిల్లీ: అరేబియాలో సముద్ర దొంగల బారి నుంచి వివిధ దేశాల నౌకలకు భారత నేవీ అండగా నిలుస్తున్నది. తాజాగా సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు పైరేట్ల నుంచి ఇరాన్ నౌకను నేవీ రక్షించింది. భారత నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపిన వివరాల ప్రకారం ఏడుగురు దొంగలు శుక్రవారం తెల్లవారుజామున ఎఫ్వీ ఒమ్రైల్ నౌకను దోచుకోవాలని ప్రయత్నించారు.
నౌకలోని 11 మంది ఇరానియన్లు, 8 మంది పాకిస్థానీ సిబ్బందిని బందీలను చేసుకున్నారు. సోమాలియా దొంగల దాడిని గమనించిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ శారద వెంటనే రంగంలోకి దిగి బాధితులకు విముక్తి కల్పించింది.