Indian Navy | అరేబియా సముద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. తక్షణమే స్పందించిన భారత నౌకాదళం (Indian Navy).. అందులోని వారిని ప్రాణాలతో రక్షించింది. ప్రమాద సమయంలో నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు.
పులావు జెండాతో ‘ఎం.టి. యి చెంగ్ 6’ (MT Yi Cheng 6) అనే ఆయిల్ ట్యాంకర్ 14 మంది భారతీయ సిబ్బందితో గుజరాత్లోని కాండ్లా ఓడరేవు నుంచి ఒమన్లోని షినాస్కు (Oman Bound Vessel) బయల్దేరింది. మార్గం మధ్యలో ట్యాంకర్ ఇంజిన్ రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నౌకలోని విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అందులోని సిబ్బంది నిస్సహాయ స్థితిలో నడి సముద్రంలో చిక్కుకుపోయారు. సహాయం కోసం డిస్ట్రెస్ కాల్ పంపారు. ఒమన్ గల్ఫ్లో గస్తీ కాస్తున్న భారత నౌకాదళానికి చెందిన 13 మంది భారతీయ నావికాదళ సిబ్బంది, ఐదు మంది సిబ్బందితో కూడిన ఐఎన్ఎస్ తబార్ (INS Tabar) స్టెల్త్ యుద్ధనౌక వెంటనే రంగంలోకి దిగింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టింది. మంటలను అదుపు చేసింది. అందులోని సిబ్బందిని రక్షించింది.
#IndianNavy‘s stealth frigate#INSTabar, mission deployed in the Gulf of Oman, responded to a distress call from Pulau flagged MT Yi Cheng 6, on #29Jun 25.
The vessel with 14 crew members of Indian origin, transiting from Kandla, India to Shinas, Oman, experienced a major fire… pic.twitter.com/hcwCalBW96
— SpokespersonNavy (@indiannavy) June 30, 2025
Also Read..
India-US | షరతులకు రెండు దేశాలూ ఓకే.. జులై 8 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటన..!
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు.. ఎప్పుడు..? ఎందుకంటే..?
Fatwa | వారు దేవుడి శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ