Indian Navy | ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ భుజాలపై ధరించే ఎపాలెట్ల డిజైన్లో మార్పు చేశారు. కొత్త డిజైన్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్రను ఇస్పైర్గా తీసుకొని రూపొందించారు. ఇండియన్ నేవీ డే సందర్భంగా ఎపాలెట్స్ మార్చినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మన సంపన్నమైన సముద్ర వారసత్వానికి నిజమైన ప్రతిబింబమని నేవీ పేర్కొంది. ఎపాలెట్స్లోని గోల్డెన్ బట్ బానిస మనస్తత్వాన్ని తొలగించడానికి భారత నావికాదళం అంకితభావాన్ని చూపుతుందని నేవీ పేర్కొంది.
అష్టభుజి ఎనిమిది కార్డినల్ దిశలను చూచిస్తుందని.. టెలిస్కోప్ మారుతున్న ప్రపంచంపై నౌకాదళం దీర్ఘకాలిక దృష్టి, దూరదృష్టి స్థిరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని తెలిపింది. కత్తి ముందంజ వేయడానికి, ఆధిపత్యంతో యుద్ధాలను గెలవడానికి, ప్రత్యర్థులను ఓడించడానికి, ప్రతి సవాల్ను అధిగమించడానికి నౌకాదళ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుదని నేవీ పేర్కొంది.
డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా మహారాష్ట్ర సింధుదుర్గ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని భారతీయ సంస్కృతికి సరిపోయేలా ఇండియన్ నేవి ర్యాంకులలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో మోదీ బానిస మనస్తత్వాన్ని వదిలి భారతదేశం ముందుకు సాగుతోందని అన్నారు. నేవీ అధికారులు ధరించే ఎపాలెట్లు ఇక నుంచి భారతీయ సంస్కృతిని, ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. రియర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, అడ్మిరల్ స్థాయి అధికారుల ఎపాలెట్లలో మార్పులు జరిగాయి.