మాస్కో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 23 ఏండ్ల భారతీయుడు మరణించాడు. ఈనెల 21న డోనెట్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాల వైమానిక దాడుల్లో గుజరాత్కు చెందిన హిమిలి అశ్విన్భాయి మంగుకియా మరణించినట్టు ఆదివారం వార్తా కథనాలు వెలువడ్డాయి. గత డిసెంబర్లో రష్యాకు వెళ్లిన ఇతను, అక్కడి సైన్యంలో ‘సెక్యూరిటీ హెల్పర్’గా చేరినట్టు తెలిసింది.