బెంగళూరు, సెప్టెంబర్ 12: క్యాన్సర్ను అంతమొందించేందుకు ఇండియన్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) సైంటిస్టులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ట్యూమర్లకు చికిత్స చేయటంలో ఇది గణనీయమైన ప్రభావం చూపుతుందని తాజా నివేదిక ఒకటి తెలిపింది. బంగారం, కాపర్ సల్ఫైడ్ నుంచి ‘హైబ్రిడ్ నానోపార్టికల్స్’ను పంపి క్యాన్సర్ కణాల్ని అంతం చేయవచ్చునని, ధ్వని తరంగాలతో క్యాన్సర్ కణాల్ని గుర్తించవచ్చునని ‘ఏసీఎస్ అప్లయిడ్ నానో మెటీరియల్స్’ జర్నల్ ప్రచురించింది.
కాపర్ సల్ఫైడ్ నానోపార్టికల్స్తో క్యాన్సర్ గుర్తించవచ్చునని, బంగారం నానోపార్టికల్స్ క్యాన్సర్ కణాల్ని చంపుతున్నదని గత పరిశోధనల్లో తేలింది. ఈ రెండు పరిశోధనల్ని కలిపి ‘హైబ్రిడ్ నానోపార్టికల్స్’ అనే కొత్త విధానానికి సైంటిస్టులు రూపకల్పన చేశారని నివేదిక వివరించింది.