న్యూఢిల్లీ, ఆగస్టు 3: వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019పై కేంద్రం వెనక్కి తగ్గింది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్సభలో ప్రకటన చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) 81 సవరణలు ప్రతిపాదించడంతో పాటు చట్టపరమైన సమగ్ర విధానం దిశగా 12 కొత్త సిఫారసులు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకున్నది. కమిటీ సిఫారసులకు అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించనున్నది. సోషల్ మీడియా కంపెనీలు, డాటా ప్రతినిధులతో సహా అన్ని భాగస్వామ్య పక్షాలతో మళ్లీ సంప్రదింపులు జరుపనున్నది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
ఏమిటీ బిల్లు?
డిజిటల్ మాధ్యమాల్లో పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకుండా రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో 2019 డిసెంబర్లో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. భారత్లోని సోషల్మీడియా సంస్థలు, ఇతర కంపెనీలు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రక్రియపై పర్యవేక్షణ ఉండాలని ఈ బిల్లు సూచిస్తున్నది.
విపక్షాల అభ్యంతరాలేమిటి?