కలుషిత దగ్గు మందు కేసులో కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: కలుషిత దగ్గు మందును వినియోగించడం వల్ల 68 మంది చిన్నారులు మృతి చెందిన కేసులో భారతీయుడు సింగ్ రాఘవేంద్ర ప్రటర్కు ఉజ్బెకిస్థాన్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. పన్నుల ఎగవేత, నాసిరకం, కలుషిత మందుల అమ్మకం, పదవీ దుర్వినియోగం, నిర్లక్ష్యం, ఫోర్జరీ, లంచం ఇవ్వడం వంటి నేరాలు రుజువైనందుకు ఆయనతోపాటు 23 మందికి రెండేండ్ల నుంచి 20 ఏండ్ల వరకు జైలు శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక్కొక్క బాధిత చిన్నారి కుటుంబానికి రూ.66.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.