Flight crash: ఆఫ్ఘనిస్థాన్లో ఘోరం జరిగింది. భారత్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. ఇవాళ ఉదయం తోప్ఖానా పర్వతాల్లో విమానం కుప్పకూలిందని ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్ సమాచార శాఖ కూడా తమ దేశంలో భారత ప్రయాణికుల విమానం కుప్పకూలిందని ధృవీకరించింది.
కాగా, ప్రమాదానికి గురైన విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు..? ఆ విమానం ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తుండగా ప్రమాదం జరిగింది..? ఇంతకూ ప్రమాదానికి గురైంది ఏ విమానం..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.