ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం పోలాండ్కు తరలినా… పనిచేస్తూనే వుంటుందని అధికారులు ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు తమని ఇప్పటికీ సంప్రదించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులారా… భారత ఎంబసీ పనిచేస్తూనే వుంటుంది. ఈమేయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. cons1.kyiv@mea.gov.inand the following 24*7 helpline numbers on WhatsApp for assistance: +380933559958, +919205209802 and +917428022564,” అని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్కు తరలిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. బాంబుల మోత, యుద్ధ వాతావరణం, క్షిపణుల దాడి నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.