న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: లక్షద్వీప్ విషయంలో ఇప్పటికే వివాదం నెలకొన్న వేళ.. మాల్దీవులు మరో వివాదానికి తెర లేపింది. భారత్కు చెందిన కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ ఫిష్షింగ్ బోట్లలోకి ఎక్కారని ఆరోపించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఈనెల 1న అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరింది.
తమ ఆర్థిక జోన్లో తిరుగుతున్న మూడు మాల్దీవుల ఫిష్షింగ్ బోట్లలోకి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లకు చెందిన సిబ్బంది బృందాలు ఎందుకు ఎక్కాయని ముయిజ్జు ప్రభుత్వం ప్రశ్నించింది.