న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: బియ్యం ధరలను నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ బియ్యాన్ని రిటైల్ అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి. ఈ బియ్యా న్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ బియ్యం అమ్మకం ద్వారా ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని ఎఫ్సీఐ అధికారి ఒకరు తెలిపారు. కేంద్రం ఇప్పటికే కిలో శనగపప్పును రూ.60కి, గోధుమ పిండిని రూ.27.50కి రాయితీ ధరతో భారత్ బ్రాండ్ పేరిట
విక్రయిస్తున్నది.