న్యూఢిల్లీ: కరోనా కారణంగా రెండేండ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విమానయాన మంత్రి సింధియా మంగళవారం తెలిపారు. విమానాల్లో ఎయిర్ బబుల్ పద్ధతి కూడా 27 నుంచి రద్దు అవుతుందన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపేసింది.