దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చాలని కోరుతూ 2016లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని తిరస్కరించిన నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ‘భారత్ లేక ఇండియా.. మీకు ఎలా అనిపిస్తే అలాగే పిలవండి. భారత్ అని పిలవాలని ఉంటే అలాగే పిలవండి. కొందరికి ఇండియా అని చెప్పాలని ఉంటుంది. వారిని అలాగే చెప్పనిద్దాం’ అని వ్యాఖ్యానించారు. 2020లో ఇదే అంశంపై దాఖలైన మరో పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ను కేంద్రానికి విజ్ఞాపన పత్రంగా పంపవచ్చని సూచించింది. సీజేఐగా ఉన్న జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం భారత్, ఇండియా అన్న రెండు పేర్లను ఇచ్చింది. రాజ్యాంగం ఇండియాను ఇప్పటికే భారత్ అని సంబోధించింది’ అని గుర్తుచేశారు.