భువనేశ్వర్: దేశీయంగా అభివృద్ధి చేసిన తారా ఆయుధ వ్యవస్థను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతం చేయనుంది. మార్గదర్శకత్వం లేని వార్హెడ్లను కచ్చితత్వంతో కూడిన గైడెడ్ ఆయుధాలుగా మార్చడానికి అభివృద్ధి చేసిన ఈ ఆయుధ వ్యవస్థను డీఆర్డీవో, ఐఏఎఫ్ సంయుక్తంగా పరీక్షించాయి.
భూతల లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాల విధ్వంసక శక్తిని, కచ్చితత్వాన్ని మెరుగుపరచడం కోసం ఈ వ్యవస్థను తయారుచేసింది.