బాలాసోర్ (ఒడిశా), డిసెంబర్ 18: అణ్వాయుధాలను మోసుకెళ్లగల కొత్తతరం అగ్ని ప్రైమ్ క్షిపణిని డీఆర్డీవో శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి ఈ పరీక్ష నిర్వహించింది. దీన్ని విజయవంతంగా పరీక్షించటం ఇది రెండోసారి. క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించిందని డీఆర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి వెయ్యి నుంచి 2 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు