బాలాసోర్, డిసెంబర్ 7: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 పరీక్షను భారత్ గురువారం విజయవంతంగా నిర్వహించింది.
ఒడిశా కోస్తాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీనిని పరీక్షించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్షిపణిని ఇదే కేంద్రం నుంచి ఈ ఏడాది జూన్ 1లో విజయవంతంగా పరీక్షించారు.