న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జమ్ము కశ్మీర్లోని రావి నదిపై భారత్ కొత్త వంతెన నిర్మించింది. దీని వల్ల ఇకపై పాకిస్థాన్లోకి ఆ నదీ జలాలు వెళ్లడం ఆగిపోయింది. కొత్త వంతెన కారణంగా స్థానిక పొలాలకు తగినంత సాగునీరు అందనుంది. షాహ్పూర్ కంది బ్యారే జ్గా పిలిచే ఈ నిర్మాణం వల్ల గతంలో పాకిస్థాన్లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల నీటిని కశ్మీర్లోని పొలా లకు మళ్లించనున్నారు. ఈ ప్రాజెక్టును జల విద్యుత్తు ఉత్పత్తి కోసం కూడా వాడనున్నారు. జమ్ము కశ్మీర్-పంజాబ్ రాష్ర్టాల మధ్య ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై నాలుగున్నరేండ్లు వివాదం నడిచింది. 1995లో నాటి ప్రధాని పీవీ నర్సింహా రావు ఈ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు. 1960లో భారత్-పాక్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ నదులపై పూర్తి నీటి యాజ మాన్య హక్కులు భారత్కు ఉంటాయి.