Rajnath Singh : పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) ను భారత్ తన సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ (Defence Minister) మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఏఎన్ఐ నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0 (National Security Summit 2.0) లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి (Union Govt) ఈ వ్యాఖ్యలు చేశారు. సామర్థ్యం లేక ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ను ఆపేయలేదని, అది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయమని రాజ్నాథ్ పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ మన సాయుధ దళాల సమైక్యతకు కూడా ఒక ఉదాహరణ అని, ఇందులో మన త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్లాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సొంత నిబంధనల ప్రకారమే ఆపరేషన్ను ప్రారంభించి సరైన సమయంలోనే దాన్ని ముగించామని, అది స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉగ్రవాదం మానవత్వానికి మాయని మచ్చ అని చెప్పారు. దీనిపై పోరాటం కేవలం భద్రతకు సంబంధించిన విషయమే కాదని, మానవత్వపు మౌలిక విలువలను పరిరక్షించేందుకని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్పై రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశాన్ని అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా అభివర్ణించారు. ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, దానికి బహుముఖ కోణాలు ఉన్నాయని అన్నారు. దాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాక్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైతే.. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కేంద్ర బిందువుగా మారిందంటూ ఎద్దేవా చేశారు.