న్యూఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా ఐరాసలో చైనా అడ్డుపుల్ల వేయడాన్ని భారత్ ఖండించింది. భౌగోళిక ప్రయోజనాల కోసం టెర్రరిస్టులను నిషేధిత జాబితాలో చేర్చలేకపోతే మనకు ఉగ్రవాదంపై పోరాడే సంకల్పం లేనట్టేనని మండిపడింది.
సాజిద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్, అమెరికా సంయుక్త ప్రతిపాదనను ఐరాస భద్రతా మండలి ‘అల్ఖైదాపై ఆంక్షల కమిటీ’ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా చైనా అడ్డుకుంది.