న్యూఢిల్లీ: తేజస్ యుద్ధ విమానాల కోసం 113 ఎఫ్404-జీఈ-ఐఎన్20 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. వీటిని హెచ్ఏఎల్కు అప్పగించడం 2027 నుంచి ప్రారంభమవుతుందని, 2032 నాటికి పూర్తవుతుందని హెచ్ఏఎల్ అధికారులు తెలిపారు.
భారత్-అమెరికా మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న టారిఫ్ల సంక్షోభం నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది.