న్యూఢిల్లీ : ఈ-కామర్స్లో విప్లవాత్మక మార్పులకు ఊతమిచ్చేలా సమగ్ర ఈ-కామర్స్ విధానం, నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న అంశాలను పొందుపరచడంతో పాటు అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ఈ-కామర్స్ విధానాన్ని కేంద్రం త్వరలో వెల్లడిస్తుందని మంత్రి ప్రకటించారు. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్తో పీయూష్ గోయల్ భేటీ ముగిసిన అనంతరం ఈ-కామర్స్ విధానంపై ప్రకటన వెలువడింది.
ఇక పీయూష్ గోయల్ ప్రస్తుతం ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్నారు. మంత్రి భారత్ తిరిగివచ్చిన వెంటనే నూతన ఈ-కామర్స్ విధానం, నిబంధనలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్, టాటాక్లిక్, మీషో, స్నాప్డీల్, షిప్ రాకెట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్ధల ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపిన మీదట ఈ-కామర్స్ విధానానికి తుదిమెరుగులు దిద్దారు.
ఆరు కీలక అంశాలపై ఏకాభిప్రాయం సాధించడంతో పాటు ఈ-కామర్స్ రంగం కొత్తపుంతలు తొక్కేందుకు నూతన పాలసీ ఊతమిస్తుందని భావిస్తున్నారు. వినియోగదారులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలనూ పరిరక్షించేలా విధానానికి రూపకల్పన చేసినట్టు చెబుతున్నారు.
Read More :
Delhi Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. క్షీణించిన వాయు నాణ్యత