న్యూఢిల్లీ: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగ మ్మాయి జాహ్నవి కేసులో అమెరికన్ పోలీసులపై ఎలాంటి ఆధారాల్లేవని అతన్ని అమెరికా కోర్టు విడుదల చేయటంపై భారత్ విస్మయం వ్యక్తం చేసింది.
తీర్పుపై సమీక్ష చేయాలని భారత రాయబారి కార్యాలయం శనివారం కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిపేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. జాహ్నవి కేసుపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నట్టు వెల్లడించింది.