బెంగళూరు, డిసెంబర్ 5: చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యుల్(పీఎం)ను చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్య వైపు మరల్చినట్టు ఇస్రో మంగళవారం వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ ఉద్దేశాలను పూర్తిగా చేరుకున్నట్టు తెలిపింది.
ల్యాండర్ మాడ్యుల్ను జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి తుది లూనార్ పోలార్ సర్క్యులర్ ఆర్బిట్కు చేర్చి ల్యాండర్ను వేరు చేయడం ప్రొపల్షన్ మాడ్యుల్ ముఖ్య ఉద్దేశమని చెప్పింది. అనంతరం ప్రొపల్షన్ మాడ్యుల్ చంద్రుడి కక్ష్యలోనే తిరుగతూ భూమికి సమాచారం చేరవేసింది. తాజాగా ఈ మాడ్యుల్ను భూ కక్ష్యవైపు మళ్లించారు. ఇందులోని షేప్ పేలోడ్ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది.