న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 7350 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,97,860కి చేరింది. ఇందులో 4,75,636 మంది మరణించగా, 3,41,30,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 91,456 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 202 మంది మృతిచెందగా, 7973 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. యాక్టివ్ కేసులు 561 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.26 శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.37 శాతం ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,33,17,84,462 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.