న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,084 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,24,78,060కు చేరాయి. ఇందులో 4,11,80,751 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 5,06,520 మంది బాధితులు మృతిచెందారు. మరో 7,90,789 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 1,67,882 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా 1241 మంది మరణించారని తెలిపింది. కరోనా కేసులు తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటులో కూడా తగ్గుదల నమోదయిందని పేర్కొన్నది.
ప్రస్తుతం రోజువారీ పాజిటిరేటు 4.44 శాతంగా ఉందని చెప్పింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.86 శాతానికి పడిపోయాయని వెల్లడించింది. ఇక 1,71,28,19,947 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.