న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 7 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు అవి 6 వేలకు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదుకాగా, 132 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 3,47,46,838కు చేరగా, మరణాలు 4,77,554కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,41,87,017 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 82,267 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా మరో 8077 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, దేశంలో కరోనా రికవరీ రేటు 98.39 శాతం ఉన్నదని, మరణాల రేటు 1.37 శాతం, యాక్టివ్ కేసులు 0.24 శాతం ఉన్నాయని తెలిపింది. ఆదివారం రాత్రివరకు దేశవ్యాప్తంగా 1,37,67,20,359 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో నిన్న ఒకేరోజు 15,82,079 మంది టీకాలు తీసుకున్నారని వెల్లడించింది.