న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 8,043 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 453 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 79,097 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
దేశంలో ఇప్పటి వరకు 3,47,52,164 కేసులు నమోదవగా.. ఇందులో 3,41,95,060 మంది కోలుకున్నారు. 4,78,007 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 1,38,34,78,181 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల్లో యాక్టివ్ కేసులు 0.24శాతంగా ఉన్నాయని పేర్కొంది.