న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 724 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 4,08,764 మంది చనిపోయారు. కరోనా నుంచి మరో 39,649 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,00,14,713. దేశంలో ప్రస్తుతం 4,50,899 కేసులు యాక్టివ్గా ఉండగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,74,376. ఇప్పటి వరకు 37.73 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరగగా, గడిచిన 24 గంటల్లో 12,35,287 మంది టీకాలు వేయించుకున్నారు.
India reports 37,154 new #COVID19 cases, 39,649 recoveries, and 724 deaths in the last 24 hours, as per Health Ministry
— ANI (@ANI) July 12, 2021
Total cases: 3,08,74,376
Total recoveries: 3,00,14,713
Active cases: 4,50,899
Death toll: 4,08,764
Total vaccinated:37,73,52,501 (12,35,287 in last 24 hrs) pic.twitter.com/33XCllf6yV