న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో జనాలు కరోనా బారినపడుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటుకు కూడా పెరుగుతూ వస్తున్నది. అయితే వరుసగా మూడో రోజూ రోజువారీ కేసులు తగ్గడం కాస్త ఊరటనిస్తున్నది. ఆదివారం నాటికంటే నేడు 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కొత్తగా 3,06,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,95,43,328కి పెరిగాయి. ఇందులో 3,68,04,145 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 4,89,848 మంది మృతిచెందారు. మరో 22,49,335 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 439 మంది మరణించగా, 2,43,495 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా కరోనా పాజిటివిటీరేటు 20.75 శాతానికి చేరిందని తెలిపింది.
ఇక కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు 8209కి చేరాయి. ఇప్పటివరకు 3109 మంది బాధితులు కోలుకున్నారని వెల్లడించింది. మరో 5100 కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 1738 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నది. పశ్చిమబెంగాల్లో 1672, రాజస్థాన్లో 1276, ఢిల్లీలో 549 చొప్పను కేసులు రికార్డయ్యాయి.
3.06 Lakh New Covid Cases In India