న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తగ్గినా.. 3లక్షలపైగా కొత్త రికార్డవగా.. 500పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,33,533 మంది కరోనా నిర్ధారణ అయ్యిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 4,171 కేసులు తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. కొత్తగా 525 మంది వైరస్తో మృతి చెందగా.. తాజాగా 2,59,168 మంది కోలుకున్నారని చెప్పింది.
ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. పాజిటివిటీ రేటు 17.78శాతానికి పెరిగిందని పేర్కొంది. కొత్త కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264కు పెరగ్గా.. 3,65,60,650 మంది కోలుకున్నారు. 4,89,409 మంది కొవిడ్ దుర్మరణం పాలయ్యారు. తాత్కాలికంగా అందిన సమాచారం మేరకు ఇవాళ ఉదయం 7 గంటల వరకు దేశంలో 161.92కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ చేసినట్లు వివరించింది.