న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,23,654 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో 2252 మంది కోలుకోగా, 32 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కరోనా కేసుల్లో 0.04 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ఇప్పటివరకు 1,88,19,40,971 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, మంగళవారం ఒక్కరోజే 21,97,082 మందికి వ్యాక్సినేషన్ చేశామంది.